వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై-కేటగిరీ భద్రతను కేటాయించిన కేంద్రం

YSRCP MP Raghu Ramakrishna Raju gets Y Category security
  • వైసీపీ ఎమ్మెల్యేలతో ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురాజు
  • నిన్న రాత్రి సమాచారం అందిందన్న రఘురాజు
  • ఇప్పట్లో నియోజకవర్గానికి రాలేనన్న ఎంపీ
తనకు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందని... కేంద్ర బలగాలతో తనకు భద్రతను కల్పించాలంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విన్నపాలకు కేంద్రం స్పందించింది. ఆయనకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ, తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించినట్టు నిన్న రాత్రి తెలిసిందని చెప్పారు. ఈరోజు అధికారికంగా లేఖ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

వై-కేటగిరీ కింద తనకు దాదాపు 10 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని... కర్ఫ్యూని సడలించిన తర్వాత వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే  కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Go Back to Shorts
Raghu Ramakrishna Raju
Y Category Security
YSRCP

More Telugu News