Nara Lokesh: వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: ఆడియో టేప్ పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fires on ycp leaders
  • వాలంటీర్ల పేరుతో వేల కోట్లు వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు
  • పెన్షన్ దగ్గర నుండి ఇళ్ల పట్టాల దాక వసూళ్ల దందా
  • డ్రైవర్ నాయుడు గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే
  • దీనికి కారణమైన వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'వాలంటీర్ల పేరుతో 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. పైగా పెన్షన్ దగ్గర నుండి ఇళ్ల పట్టాల దాకా వసూళ్ల దందా. వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది' అని అన్నారు.  

'డ్రైవర్ నాయుడు గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే. దీనికి కారణమైన వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలి' అంటూ ఆయన ఓ ఆడియో టేప్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News