ప్రపంచానికి ఉగ్రవాదంతో పెనుసవాల్... ముంబయి పేలుళ్లు ఘోరమైన చర్య: చైనా
- జియాన్జియాంగ్ ప్రావిన్స్లో ఉగ్రవాదుల ఏరివేతపై శ్వేతపత్రం విడుదల
- శాంతికి, అభివృద్ధికి ఉగ్రచర్యలతో ఆటంకం అని వ్యాఖ్యలు
- చైనా సానుకూల స్పందనతో మసూద్ విషయంలో ఆశలు
ఇటీవల పుల్వామా దాడులు, ఆ తర్వాత పరిణామాల నేపధ్యంలో కూడా భారత్ ఇదే ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలిలో పెట్టింది. అయితే అన్ని దేశాలు అంగీకరిస్తున్నప్పటికీ, వీటో అధికారం ఉన్న చైనా పదేపదే దీన్ని అడ్డుకుంటోంది. గత నెలలో ప్రతిపాదనను కూడా ఐరాసలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు అంగీకరించగా ఒక్క చైనా మాత్రమే వ్యతిరేకించింది. ఇది జరిగిన కొద్దిరోజులకే డ్రాగన్ ఉగ్రవాదంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశలు రేకెత్తిస్తోంది.