ఫోర్లు, సిక్సులు... 500 దాటేసిన భారత స్కోర్!
- పంత్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన జడేజా
- సెంచరీకి చేరువైన పంత్
- స్కోర్ 6 వికెట్ల నష్టానికి 501 పరుగులు
ప్రస్తుతం రిషబ్ పంత్ 93 పరుగులు, రవీంద్ర జడేజా 30 పరుగుల వద్ద ఉన్నారు. భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 500 పరుగులు. స్కోరును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడం, పంత్ కు తన రెండో టెస్ట్ సెంచరీ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంపై దృష్టిని పెట్టిన కోహ్లీ, అది పూర్తయిన తరువాత తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు ఆసీస్ ను కనీసం 15 నుంచి 20 ఓవర్లు బ్యాటింగ్ చేయించాలన్నది భారత్ వ్యూహం.