మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై వీరంగమేసిన యువతులు
- శుక్రవారం రాత్రి నగరంలో ఆరు చోట్ల తనిఖీలు
- మద్యం మత్తులో పోలీసులతో మహిళల వాగ్వాదం
- ఓ టీవీ చానల్ కెమెరామన్పై దాడి.. కెమెరా ధ్వంసం
పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ టీవీ చానల్ కెమెరామన్పై దాడికి దిగాడు. అతడి కెమెరాను లాక్కుని ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడికి దిగాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్లో మొత్తం 123 వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.