బీజేపీకి చెక్ చెప్పేందుకు... త్యాగానికి సిద్ధమైన కాంగ్రెస్!
- ప్రధాని పదవిని వదులుకునేందుకు సిద్ధం
- మమత లేదా మాయావతివైపు మొగ్గు
- విపక్షాలకు సంకేతాలు పంపిన కాంగ్రెస్
ఇటీవలి అవిశ్వాస తీర్మానం సమయంలో ఎన్డీయేకు 300కు పైగా సభ్యుల మద్దతు రావడంతోనే కాంగ్రెస్ వైఖరిలో ఈ మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు రాహుల్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. వివిధ ప్రాంతీయ పార్టీలు భిన్నాభిప్రాయాలతో ఉండటమే ఇందుకు కారణం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురొడ్డి నిలవాలంటే, సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలను కలుపుకు పోతేనే సాధ్యమవుతుందని సోనియా గాంధీ సైతం నమ్ముతూ, ప్రధాని పదవిని మరొకరికి ఇవ్వాలన్న రాహుల్ గాంధీ అభిప్రాయానికి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం, బీజేపీని అడ్డుకునేందుకు తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే వ్యూహాన్ని జాతీయ స్థాయిలోనూ అమలు చేయాలన్నది కాంగ్రెస్ అభిమతం.