10 సిక్సర్లతో చెలరేగి ఆర్.ఆర్ జట్టుకు విజయం కట్టబెట్టిన సంజు శాంసన్!
- 10 సిక్సులతో చెలరేగిన సంజు శాంసన్
- 45 బంతుల్లో 92 పరుగులు
- సీజన్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆర్.ఆర్. జట్టు
ఈ క్రమంలో సంజు శాంసన్ కేవలం బౌండరీలు (2), సిక్సర్ల (10) ద్వారా 68 పరుగులు చేశాడంటే ఎంత ధాటిగా ఆడాడో ఊహించవచ్చు. మొత్తం 45 బంతులెదుర్కొన్న సంజు శాంసన్ 92 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఐపీఎల్ లో ఇదే అతిపెద్ద లక్ష్యం. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన మెక్ కల్లమ్ (4) విఫలం కాగా, డికాక్ (26) ఫర్వాలేదనిపించాడు. కోహ్లీ (57) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. డివిలియర్స్ (20) అవుట్ కావడంతో మన్ దీప్ సింగ్ (47), వాషింగ్టన్ సుందర్ (35) మెరుపులు మెరిపించారు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగుల వద్ద ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగించి, ఓటమిపాలైంది.