కేతిరెడ్డిలాంటి పాపులు ఇక్కడకు వచ్చారు.. అందుకే పాలతో శుద్ధి చేశా: లక్ష్మీపార్వతి
- 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా నన్ను, ఎన్టీఆర్ ను అవమానించడమే
- నా పేరుతో సినిమా తీసేటప్పుడు.. నా పర్మిషన్ తీసుకోరా?
- సినిమాను అడ్డుకుంటా
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను, ఎన్టీఆర్ ను అవమానించేలా... చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీయాలనుకుంటే.. ఆ సినిమాను అడ్డుకుంటామని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా ముహూుర్తపు షాట్ ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీసేందుకు కేతిరెడ్డి యత్నించగా... బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. దీంతో, అక్కడి షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, తన అనుమతి లేకుండా తన జీవిత చరిత్రను ఎలా తీస్తారంటూ మండిపడ్డారు. కేతిరెడ్డిలాంటి కొంత మంది పాపులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించడంతో, ఈ ప్రాంతమంతా అపవిత్రమైందని... పాలాభిషేకం చేయడం ద్వారా ఘాట్ ను శుద్ది చేశానని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు పూజలు చేసే ఈ ప్రాంతంలో ఇతరులెవరో పేర్లను తీసుకొచ్చి మాట్లాడటం దారుణమని అన్నారు.