పాకిస్థాన్ సైన్యానికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యం ఇదే!: ఆర్మీ అధికారులు
- కశ్మీర్ లోని పుల్వామా జిల్లా అగ్లర్ ప్రాంతం కందీ బెల్ట్ లో ఉగ్రవాదుల ఎన్ కౌంటర్
- ఒక ఉగ్రవాది వద్ద అమెరికాలో తయారై, నాటో దళాలకు చెందిన అత్యాధునిక ఎం4 కార్బైన్ ఆయుధం
- ఎం4 కార్బైన్ తుపాకిని మసూద్ అజర్ మేనల్లుడికి ఇచ్చిన పాక్ ఆర్మీ
అనంతరం అక్కడ జరిపిన తనిఖీల్లో ఒక ఉగ్రవాది నుంచి ఎం4 కార్బైన్ ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇది అమెరికాలో తయారైన ఆయుధమని వారు వెల్లడించారు. దీనిని నాటో దళాలు వినియోగిస్తాయని వారు చెప్పారు. పాక్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళం ఈ ఆయుధాన్ని వినియోగిస్తోందని వారు చెప్పారు. ఈ ఆయుధం పాక్ సైన్యం వద్ద ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు హల్ చల్ చేశాయని వారు గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో ఆ ఆయుధాన్ని అతనికి పాక్ సైన్యమే అందించిందని వారు ఆరోపించారు. ఎన్ కౌంటర్ కు గురైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే.