మమతా బెనర్జీ గృహనిర్బంధం.. టీఎంసీ నేతల సంచలన ఆరోపణలు
- అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించకుండా అడ్డుకుంటున్నారని విమర్శ
- మమత ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపుపై సోషల్ మీడియాలో పోస్టులు
- ఈ ఆరోపణలు టీఎంసీ ఆడుతున్న నాటకమంటూ బీజేపీ వ్యాఖ్య
కోల్కతాలోని కాళీఘాట్లో ఉన్న మమతా బెనర్జీ నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. మమత నివాసానికి వెళ్లే మార్గాలను పోలీసు వాహనాలతో దిగ్బంధించిన దృశ్యాలను వారు పంచుకున్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలవకుండా అడ్డుకోవడానికే ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని డెరెక్ ఓబ్రెయిన్ మండిపడ్డారు. ఏడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక సీనియర్ నాయకురాలి పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు దారుణమని మహువా మొయిత్రా విమర్శించారు.
ఈ వివాదానికి కారణమైన బారుయిపూర్ ఘటనలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొన్నారు.