Sushma: వంట విషయంలో అత్తతో గొడవ.. బెంగళూరులో మాజీ టెక్కీ బలవన్మరణం

Sushma Former Techie Suicide in Bangalore After Quarrel with Mother in Law
  • బెంగళూరులో కుటుంబ కలహాలతో టెకీ ఆత్మహత్య
  • కట్నం కోసం వేధించారని మృతురాలి కుటుంబం ఆరోపణ
  • భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, అత్త కోసం గాలింపు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
బెంగళూరులో కుటుంబ కలహాల కారణంగా మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా, అత్త పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో డెల్ కంపెనీలో పనిచేసిన 35 ఏళ్ల సుష్మకు ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం వంట చేసే విషయంలో సుష్మకు, ఆమె అత్త కల్పనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వంట చేయనివ్వకుండా అత్త తనను నిత్యం వేధింపులకు గురిచేసేదని సుష్మ తన కుటుంబ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. భర్త పునీత్‌ను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న అత్త కల్పన కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Sushma
Bangalore
Software Engineer
Suicide
Domestic Violence
Dowry Harassment
Family Dispute
Puneeth Kumar
Kalpana
Dell

More Telugu News