టీమిండియా గెలుపుపై సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే..?

Sachin Tendulkar on Indias Victory Against Zimbabwe
టీ20 ప్రపంచకప్ 2026లో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఈ టోర్నీలోనే అత్యధికంగా 256 పరుగుల భారీ స్కోరు చేసి రికార్డు సృష్టించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ నెట్ రన్ రేట్ మైనస్‌లోకి వెళ్లింది. దీంతో టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో జింబాబ్వేతో తలపడింది. ఈ ఒత్తిడిని అధిగమించిన భారత బ్యాటర్లు, ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరును ప్రదర్శించారు. ఏ ఒక్కరూ భారీ వ్యక్తిగత స్కోరు చేయకపోయినా, అందరూ మెరుగైన స్ట్రైక్ రేట్‌తో ఆడటం జట్టు స్కోరుకు దోహదపడింది. ఈ గెలుపుతో కోట్లాది మంది భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ భారత జట్టును ప్రశంసించాడు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. "తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు ఆటగాళ్ల స్వభావాన్ని బ‌య‌ట‌పెడ‌తాయి. 256 పరుగుల భారీ స్కోర్ బాదారు. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. మ్యాచ్ ఆద్యంతం జట్టు కనబరిచిన పట్టుదల అద్భుతం. బాగా ఆడారు, ఇదే జోరును తర్వాతి మ్యాచ్‌లోనూ కొనసాగించండి. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న‌ జింబాబ్వే జట్టుకు కూడా అభినందనలు" అని సచిన్ పేర్కొన్నాడు.
Go Back to Shorts
Sachin Tendulkar
T20 World Cup 2026
Team India
India vs Zimbabwe
Cricket
Indian Cricket Team
T20 World Cup
Cricket News
Zimbabwe Cricket

More Telugu News