యుద్ధం ముగియలేదు... ఇప్పుడే ప్రారంభమైంది: ఉద్ధవ్ థాకరే
- ఈ గెలుపు ద్వారా తమను నిర్వీర్యం చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారన్న థాకరే
- బీజేపీ కుట్రలను త్వరలో బయటపెడతామని వ్యాఖ్య
- ముంబైలో శివసేన నుంచి మేయర్ను నియమించాలనేది తమ కల అన్న థాకరే
స్థానిక ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లే బీజేపీ గెలుపొందిందని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. కుట్రపూరితంగా, అక్రమంగా విజయం సాధించిందని దుయ్యబట్టారు. ముంబైని పూర్తిగా తాకట్టు పెట్టాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తమ పార్టీ 64 స్థానాలను కైవసం చేసుకుందని గుర్తు చేశారు. 227 స్థానాలున్న బీఎంసీలో బీజేపీ 89 స్థానాలు, శివసేన (షిండే) 27 స్థానాలు, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 64 స్థానాల్లో విజయం సాధించాయి.