Puligadda Jagadish Babu: ఇంట్లోంచి లాక్కెళ్లి.. ప్రభుత్వ కార్యాలయంలో యువతిపై అత్యాచారం!
- ఏలూరులో రౌడీ షీటర్ల బరితెగింపు
- ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని అర్ధరాత్రి లాక్కెళ్లిన వైనం
- బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు రౌడీ షీటర్లు బరితెగించి, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయమైన సచివాలయాన్నే ఈ అఘాయిత్యానికి వేదికగా మార్చుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరు టూటౌన్ పరిధిలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. స్నేహితురాలి కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లిన విషయాన్ని స్థానిక రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవాని కుమార్ పసిగట్టారు. ఇదే అదనుగా భావించి, అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, యువతిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
అనంతరం నిందితుల్లో ఒకడైన జగదీశ్ బాబు, ఆ యువతిని సమీపంలో ఉన్న గ్రామ సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని తీవ్రంగా బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రౌడీ షీటర్లు ఇంతగా బరితెగించి సచివాలయంలోనే అత్యాచారానికి పాల్పడటంపై సర్వత్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరు టూటౌన్ పరిధిలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. స్నేహితురాలి కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లిన విషయాన్ని స్థానిక రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవాని కుమార్ పసిగట్టారు. ఇదే అదనుగా భావించి, అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, యువతిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
అనంతరం నిందితుల్లో ఒకడైన జగదీశ్ బాబు, ఆ యువతిని సమీపంలో ఉన్న గ్రామ సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని తీవ్రంగా బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రౌడీ షీటర్లు ఇంతగా బరితెగించి సచివాలయంలోనే అత్యాచారానికి పాల్పడటంపై సర్వత్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.