Advertisement

మరోసారి వార్తల్లో ఉదయనిధి.. దీపావళి విషెస్‌పై రాజకీయ దుమారం

Udhayanidhi Stalin Sparks Controversy with Diwali Wishes
  • "నమ్మకం ఉన్నవారికే దీపావళి" అంటూ షరతులతో కూడిన శుభాకాంక్షలు
  • సనాతన ధర్మంపై వ్యాఖ్యల తర్వాత మరోసారి చర్చనీయాంశమైన ఉదయనిధి
  • డీఎంకే సంప్రదాయానికి భిన్నంగా హిందూ పండుగపై స్పందించిన వైనం
  • గత వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో జనం తనకు విషెస్ చెప్పడానికి జంకుతున్నారన్న ఉదయనిధి
తమిళనాడు మంత్రి, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఆయన, తాజాగా దీపావళి పండుగ సందర్భంగా చేసిన ఓ ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. పండుగ రోజున ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, అందులో ఓ మెలిక పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

దీపావళి సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ "నమ్మకం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అని వ్యాఖ్యానించారు. ఇది సాధారణ శుభాకాంక్ష కాదని, షరతులతో కూడినదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా డీఎంకే నేతలు తమ హేతువాద భావజాలం ప్రకారం దీపావళి వంటి హిందూ పండుగలకు శుభాకాంక్షలు చెప్పే సంప్రదాయం లేదు. దీనికి భిన్నంగా ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం, అదీ షరతులతో చెప్పడం గమనార్హం.

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యల తర్వాత నెలకొన్న పరిస్థితులపైనా ఉదయనిధి స్పందించారు. తన గత వ్యాఖ్యల కారణంగా ప్రజలు తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా భయపడుతున్నారని, జంకుతున్నారని ఆయన అంగీకరించారు. ఆ వివాదం తర్వాత తనను కలిసేందుకు, మాట్లాడేందుకు కూడా కొందరు వెనకాడుతున్నట్లు ఆయన పరోక్షంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించాయి.
Advertisement
Udhayanidhi Stalin
Udhayanidhi Stalin Diwali wishes
Tamil Nadu politics
DMK leader
Sanatana Dharma controversy
Diwali greetings
political analysis
Hindu festivals
rationalist ideology

More Telugu News