Asia Cup: ఆసియా కప్ వేదిక ఖరారు... టోర్నీ ఎప్పుడు, ఎక్కడంటే...!
- సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్
- యూఏఈ వేదికగా మ్యాచ్ లు
- టోర్నీలో మొత్తం 8 జట్లు
- భారత్, పాక్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం
ఆసియా కప్ 2025 తేదీలు ఖరారయ్యాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈసారి ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వే అయినప్పటికీ... తటస్థ వేదికలో (యూఏఈ) ఈ ఈవెంట్ను నిర్వహించడానికి బీసీసీఐ అంగీకరించింది.
ఆసియా కప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. కాగా, ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉంటే... లీగ్ దశలో ఒకసారి, సూపర్-4 రౌండ్లో మరోసారి తలపడతాయి. కుదిరితే ఈ రెండు జట్లే ఫైనల్లోనూ ఆడే అవకాశం ఉంది.
ఆసియా కప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. కాగా, ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉంటే... లీగ్ దశలో ఒకసారి, సూపర్-4 రౌండ్లో మరోసారి తలపడతాయి. కుదిరితే ఈ రెండు జట్లే ఫైనల్లోనూ ఆడే అవకాశం ఉంది.