అన్నమయ్య జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఐబీ
- రాయచోటిలో కోయంబత్తూరు పేలుళ్ల కేసు నిందితులు
- 30 ఏళ్లుగా మారు పేర్లతో రహస్య జీవనం సాగిస్తున్న నిందితులు
- స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్న చెన్నై ఐబీ అధికారులు
వీరు 1985లో కోయంబత్తూరు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. వీరు ఇద్దరూ మారుపేర్లతో రాయచోటిలో ఉన్నట్లు గుర్తించిన చెన్నై ఐబీ అధికారులు నిన్న స్థానిక పోలీసుల సహకారంతో వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
సిద్ధిఖీ, మహమ్మద్ అలీ ఇళ్లలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ చెన్నై తీసుకుని వెళ్లారు. గత మూడు దశాబ్దాలుగా బట్టల వ్యాపారం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ఈ సోదరులు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన వారని తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.