WAVES: 'వేవ్స్‌' సమ్మిట్‌కు హాజ‌రైన చిరంజీవి.. ఇదిగో వీడియో!

Chiranjeevi Attends WAVES Summit 2025 in Mumbai
     
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. కేంద్ర సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్ ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగ‌నుంది. 

ఇప్ప‌టికే ఈ మెగా ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ న‌టులు ఆమిర్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్, మోహ‌న్‌లాల్ త‌దిత‌రులు చేరుకున్నారు. వీరికి నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు. బుధ‌వార‌మే చిరంజీవి ఈ కార్య‌క్ర‌మం కోసం హైద‌రాబాద్ నుంచి ముంబ‌యి చేరుకున్న విష‌యం తెలిసిందే. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఈ మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. ఇది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం. ఇక్కడ ఆయన మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌ధాని మోదీ ఏకంగా 10 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌డం విశేషం. 
WAVES
Chiranjeevi
WAVES Summit 2025
Mumbai
Geo World Center
Indian Cinema
Bollywood
Tollywood
Aamir Khan
Akshay Kumar
Mohanlal
Narendra Modi
Entertainment Summit
Audio Visual Summit

More Telugu News