వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి 8 ప్రత్యేక రైళ్లు

8 Special Trains to Tirupati for Summer Rush
--
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వేసవిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌ - తిరుపతి వయా వికారాబాద్‌, గుంతకల్‌ మార్గంలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి, మే 9 నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు. ఈ రైళ్లు సనత్‌నగర్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, సెడాం, యాద్గిర్‌, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్‌, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని ఆయన వివరించారు.
Go Back to Shorts
Tirupati
Special Trains
Tirumala
Summer Rush
Railway
Andhra Pradesh
Telangana
Secunderabad-Tirupati
South Central Railway
Srivari Darshan

More Telugu News