బీజేపీ కూటమి నుంచి తన పార్టీ వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి
- బీహార్ లో ఆర్ఎల్జీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి
- అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆ పార్టీ చీఫ్ పశుపతి పరాస్ ప్రకటన
- నితీశ్ కుమార్ దళిత వ్యతిరేకి అంటూ ఆరోపణలు
ఈ ఏడాది జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్జీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు దళితులంటే గిట్టదని ఆరోపించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో పర్యటించానని రాబోయే రోజుల్లో మిగతా 16 జిల్లాల్లో పర్యటిస్తానని పరాస్ తెలిపారు. ఈ పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని తాను గుర్తించానని వివరించారు. బీహార్ ప్రజలు నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని రాష్ట్రంలో ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.