లక్నోపై అలవోకగా గెలిచిన పంజాబ్ కింగ్స్

Punjab Kings Triumphs Over Lucknow Super Giants in IPL 2025
  • ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • 8 వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్
  • అదరగొట్టిన ప్రభ్ సిమ్రన్ సింగ్ 
  • పంజాబ్ కు వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపై చిత్తు చేస్తూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు, పంజాబ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (44), ఆయుష్ బదోని (41) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. సమద్ 27 పరుగులతో మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీసి లక్నో బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 52, నేహల్ వధేరా 42 పరుగులతో రాణించడంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయం పంజాబ్ కింగ్స్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. వరుసగా రెండో విజయం సాధించడంతో పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఓటమితో నిరాశలో కూరుకుపోయింది.

Go Back to Shorts
Punjab Kings
Lucknow Super Giants
IPL 2025
Cricket Match
Punjab Kings win
Arshdeep Singh
Prabhsimran Singh
Shreyas Iyer
Nicholas Pooran
Ayush Badoni

More Telugu News