ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్‌ ప్ర‌ధాని గ‌ల్లీ క్రికెట్‌.. ఇవిగో ఫొటోలు!

New Zealand PM Plays Street Cricket in Delhi
  
న్యూజిలాండ్ ప్ర‌ధాని క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్ ప్రస్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ వీధుల్లో అక్క‌డి పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతూ స‌ర‌దాగా గ‌డిపారు. ఆయ‌న‌తో పాటు కివీస్ మాజీ క్రికెట‌ర్ రాస్ టేల‌ర్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల‌ను ఏకం చేయ‌డంలో క్రికెట్‌ను మించిన‌ది లేదంటూ క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్‌ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోల‌ను పంచుకున్నారు.
Go Back to Shorts
Christopher Luxon
New Zealand Prime Minister
India visit
Street Cricket
Delhi
Ross Taylor
Cricket diplomacy
Photos
New Zealand
India

More Telugu News