ఎస్ఎల్బీసీ వంటి క్లిష్టమైన సొరంగ ప్రమాదం ఎక్కడా జరగలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సొరంగం 14 కిలోమీటర్ల మేర ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- చివరి 50 మీటర్లలో సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తున్నాయని వెల్లడి
- రోబోలతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నట్లు వెల్లడి
ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి 50 మీటర్లలో రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని తెలిపారు. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.