నేరుగా ఓటీటీకి నయనతార థ్రిల్లర్ మూవీ!
- నయనతార ప్రధాన పాత్రను పోషించిన 'టెస్ట్'
- థియేటర్లకు వెళ్లలేకపోయిన సినిమా
- ఏప్రిల్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
- క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నడిచే కథ
ఫలితంగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి శశికాంత్ దర్శకత్వం వహించాడు.
నయనతారతో పాటు మాధవన్ .. సిద్ధార్థ్ కీలకమైన పాత్రలను పోషించగా, ప్రత్యేకమైన పాత్రలో మీరా జాస్మిన్ కనిపించనుంది. చెన్నై క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి చిక్కుల్లో పడతారు? ఆ చిక్కులలో నుంచి బయటపడటానికి వారు ఏం చేస్తారు? అనేది కథ. ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.