ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం
- స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ అన్న మంత్రి
- ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసి పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని నేతలకు సూచించారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ అవుతాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు సులువవుతుందని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఈ ఏడాదిలో సాధించిన విజయాలను స్థానిక సంస్థల ఎన్నికల నాటికి విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఏడాది కాలంలో ఎన్నో పనులు చేసిందన్నారు. ఉపాధ్యాయ సహా పలు నియామకాలు చేపట్టినట్లు చెప్పారు.