ప్రశాంత్ కిశోర్ ని కలిశాను: నారా లోకేశ్
- ఢిల్లీ పర్యటన వివరాలను మీడియాకు వివరించిన నారా లోకేశ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడి
- ఫీడ్ బ్యాక్ కోసం ప్రశాంత్ కిశోర్ ను కలిశానన్న లోకేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ధన్యవాదాలు తెలిపానని లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలను విస్తరింపజేస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
హిందూ దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణ అంశమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అందరినీ కలుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కూడా కలిశానని చెప్పారు.