Hyderabad: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి.. సొంత నిధులతో మరమ్మతులు

Nara Lokesh unhappy with NTR Ghat maintanance
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా తన తాతకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అక్కడకు వచ్చిన లోకేశ్ ఘాట్ పరిస్థితులు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని లోకేశ్ గమనించారు. ఈ ఘాట్ మరమ్మతుల కోసం అవసరమైన అనుమతులు తీసుకొని సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు.

సొంత నిధులతో ఈ పనులు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పనులను వెంటనే ప్రారంభించాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అప్పగించాలని తాము గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Nara Lokesh
NTR Ghat
Andhra Pradesh

More Telugu News