Mallu Bhatti Vikramarka: వారు పడుతున్న ఇబ్బందిని రేవంత్ రెడ్డి, నేను గమనిస్తున్నాం: భట్టి విక్రమార్క

Bhattivikramarka says will release funds to sarpanches
  • సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల బిల్లులను విడుదల చేయాలనుకుంటున్నామని వెల్లడి
  • పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్య
  • రూ.10 లక్షల లోపు ఉన్న వాటిని తొలుత విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడి
సర్పంచ్‌లు (మాజీ), స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను గమనిస్తున్నామని, అందుకే నిధులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల (మాజీ) పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు.

అయితే ఈ నిధుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఇందులో రూ.10 లక్షల లోపు బకాయిల విలువ దాదాపు రూ.400 కోట్లుగా ఉందన్నారు. తొలుత ఈ బిల్లులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వారి బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Telangana
Congress

More Telugu News