Ambati Rambabu: ఈ రకంగా జగన్ పై కక్ష తీర్చుకోవద్దు: అంబటి రాంబాబు

Dont take revenge on Jagan in the name of God says Ambati Rambabu
షార్ట్స్‌లో చూడండి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయనను అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని దుష్ప్రచారం చేయడం దారుణమని అంబటి అన్నారు. అది కేవలం టీడీపీ నేతల అనుమానం మాత్రమేనని... లడ్డూలో కానీ, నెయ్యిలో కానీ కల్తీ జరిగినట్టు నిరూపణ అయితే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. దేవుడి పేరు చెప్పి జగన్ పై కక్ష తీర్చుకోవద్దని అన్నారు. జగన్ పై కోపం ఉంటే మరో విధంగా తీర్చుకోవాలని చెప్పారు. చంద్రబాబు సంగతి ఆ వేంకటేశ్వరస్వామే చూస్తాడని అన్నారు. 

రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ పై తోసేస్తున్నారని అన్నారు. బుడమేరు, ఏలూరుకు వచ్చిన వరదలను కూడా జగపైకి నెట్టేశారని... ప్రకాశం బ్యారేజ్ ను పడవలు ఢీకొంటే దాన్ని కూడా జగన్ కుట్ర అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Ambati Rambabu
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News