ఈవీఎంల పరిశీలనకు ఈసీ ఓకే.. బాలినేని ఫిర్యాదుపై రియాక్షన్
- ఈ నెల 19 నుంచి 24 వరకు డమ్మీ బ్యాలెట్ లతో చెకింగ్
- భెల్ ఇంజనీర్ల సాయంతో పరిశీలిస్తామని కలెక్టర్ వెల్లడి
- ఒంగోలులో ఈవీఎంల రీకౌంటింగ్ కు రూ.5.66 లక్షలు ఫీజుగా చెల్లించిన బాలినేని
బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఈవీఎంల పరిశీలనకు అంగీకరించింది. నిబంధనల మేరకు భెల్ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. ఫిర్యాదుదారుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తామని వివరించారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఈ పరిశీలన కొనసాగుతుందని తెలిపారు.