రామోజీరావులా ఒక్కరోజు జీవించగలిగినా చాలు: కీరవాణి

Keeravani attends Ramoji Rao memorial service in Vijayawada
పాత్రికేయ, సినీ రంగాలలో దిగ్గజ స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. ఈ సాయంత్రం విజయవాడ అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభకు కీరవాణి తన సోదరుడు రాజమౌళితో కలిసి హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో కీరవాణి ప్రసంగిస్తూ, మహోన్నతమైన వ్యక్తిత్వానికి రామోజీరావు ప్రతీక అని కొనియాడారు. ఆయనలా ఒక్కరోజు జీవించగలిగినా చాలు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో మనసు-మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
Go Back to Shorts
Keeravani
Ramoji Rao
Memorial Service
Vijayawada
Usha Kiran Movies
Tollywood

More Telugu News