ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు
- మెదక్ లో జంతు వధ నేపథ్యంలో అల్లర్లు
- మెదక్ వెళతానని ప్రకటించిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
- ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన రాజా సింగ్
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ నేపథ్యంలో, మెదక్ వెళ్లేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తాను మెదక్ వెళతానని రాజా సింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆయన ముంబయి నుంచి వస్తున్నారని తెలుసుకుని, శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అటు, మెదక్ లో బీజేపీ శ్రేణులు బంద్ కు పిలుపునిచ్చాయి. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.