Kinjarapu Ram Mohan Naidu: కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం

Rammaohan Naidu takes oath as union minister
షార్ట్స్‌లో చూడండి
కేంద్రమంత్రిగా టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రామ్మోహన్  శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఇంగ్లీష్‌‌లో ప్రమాణం చేశారు. టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు ఇచ్చారు. ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది.

ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఎన్డీయే ప్రభుత్వంలో ఈరోజు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు, అలాగే తనను గెలిపించి పార్లమెంట్‌కు పంపించిన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
Go Back to Shorts
Kinjarapu Ram Mohan Naidu
Narendra Modi
Chandrababu
Pawan Kalyan

More Telugu News