ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టండి.. చంద్రబాబుకు షర్మిల సూచన
- ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ
- ఏపీకి మేలు కలిగేలా ఆలోచన చేయాలన్న షర్మిల
- విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో మద్దతివ్వాలని డిమాండ్
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు పట్టుబట్టాలని చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. విభజన హామీలకు కట్టుబడతామని హామీ ఇస్తేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేలా, రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చేలా చూడాలన్నారు. రాజధాని నిర్మాణం జరగాలని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ కూటమి సమావేశంలో పట్టుబట్టాలని కోరారు. కాగా, ప్రజల పక్షాన కాంగ్రెస్ చేపట్టిన పోరాటాన్ని, జనం గొంతుకగా పార్టీ తీసుకున్న స్టాండ్ ను ఇకపైనా కొనసాగిస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.