ఏకంగా 18 క్షిపణులతో కిమ్ యుద్ధ విన్యాసాలు.. సౌత్ కొరియాకు వార్నింగ్
- అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం తమకుందని చాటి చెప్పే ప్రయత్నం
- ఫొటోలు, వీడియోలను అంతర్జాతీయ మీడియాకు విడుదల చేసిన నార్త్ కొరియా
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
రాజధాని ప్యాంగ్ యాంగ్ సమీపంలో సుప్రీం లీడర్ కిమ్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. వరుసగా ఏర్పాటు చేసిన క్షిపణులు ఏకకాలంలో నిప్పులు ఎగజిమ్ముతూ లక్ష్యం వైపుకు దూసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలలో కనిపించాయి. మొత్తం 18 క్షిపణులు టార్గెట్ ను రీచ్ అయ్యాయని కిమ్ ప్రకటించారు. కాగా, కొన్ని రోజులుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చెత్తతో యుద్ధం జరుగుతోంది. తమ దేశంలోని చెత్తను మూటకట్టి ఎయిర్ బెలూన్లతో ఒకరిపై మరొకరు పడేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర కొరియా చెత్త, మలంతో కూడిన బెలూన్లను దక్షిణ కొరియాలో జారవిడిచింది. సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, చెత్తను వదలడానికి ప్రతీకారంగా వీటిని పంపించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది.