పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్
- ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సమస్యగా పేర్కొన్న భారత విదేశాంగ శాఖ
- ఉగ్రవాదంపై దేశాల చర్యలను ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని వ్యాఖ్య
- మీడియా ప్రశ్నల నేపథ్యంలో స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
కాగా.. పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సున్నీ మిలిటెంట్ గ్రూప్ ‘జైష్ అల్ అద్ల్’ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇటీవల ఇరాన్ వైమానిక దాడులు జరిపింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉగ్రసంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడి దాడులు చేసిందని పాకిస్థాన్ ప్రభుత్వం మండిపడింది. దాడుల కారణంగా ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమ భూభాగంలోకి చొరబడిందని, చట్టవిరుద్ధ చర్యల పట్ల ప్రతిఘటించే హక్కు తమకు ఉందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. కాగా 2012లో ఏర్పడిన ‘జైష్ అల్ అద్ల్’ను ఇరాన్ ఉగ్రసంస్థగా గుర్తించింది.