బోట్లు కాలిపోయి నష్టపోయిన వారికి నేనే వచ్చి సాయం అందిస్తా: పవన్ కల్యాణ్
- విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం
- 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయన్న పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఇస్తామని ప్రకటన
విశాఖ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయని వెల్లడించారు. బోట్లు కాలిపోయి నష్టపోయిన యజమానులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిస్తానని పవన్ వివరించారు. బోట్లు నష్టపోయిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు.