మియాపూర్ లో 27 కిలోల బంగారం పట్టివేత
- భారీ మొత్తంలో వెండి ఆభరణాలు కూడా..
- పోలీసుల తనిఖీలలో బయటపడ్డ బంగారం
- బిల్లులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు
అక్రమంగా తరలిస్తున్న 27.540 గ్రాముల బంగారం, 15.650 కిలోల వెండిని గుర్తించారు. ఈ ఆభరణాలకు సంబంధించి బిల్లులు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.