బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కు ఈడీ సమన్లు
- ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో రణబీర్ కు సమన్లు
- యాప్ ను రణబీర్ ప్రమోట్ చేస్తున్నారన్న ఈడీ
- ఇప్పటికే ఈ యాప్ పై ఈడీతో పాటు పలు రాష్ట్రాల పోలీసుల విచారణ
ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి రూ. 112 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుక యూఏఈలో జరిగింది. ఈ వేడుకకు భాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, ఎల్లీ అవ్రామ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నష్రత్ భరూచా తదితులు హాజరయ్యారు. వీరిలో పలువురికి ఈడీ సమన్లు పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం.