పుంగనూరు ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీపీ.. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు
- దాడులకు పాల్పడిన వారిని గుర్తించామన్న డీజీపీ
- హింస వెనుక ఎవరున్నారనే విషయంలో ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడి
- చంద్రబాబు రూట్ ప్లాన్ మారిన విషయం దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్య
ఈ హింస వెనుక ఎవరున్నారనే విషయంలో ప్రాథమిక సమాచారం ఉందని డీజీపీ చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి సారించామని తెలిపారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మారిన విషయం కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. మరోవైపు 30 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.