జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగం నిలువలేదు: ఆదిమూలపు
- అమరావతిలో సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందన్న మంత్రి
- ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపణ
- న్యాయస్థానాలూ పేదల పక్షాన నిలబడి ఇళ్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాయని వ్యాఖ్య
ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. అన్ని మౌలిక వసతులతో ఈ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 30 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులూ సమర్థించాయన్నారు.