ఐపీఎల్ లో మరోసారి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ

ఐపీఎల్ లో మరోసారి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ

 Virat Kohli captains again DuPlessis absence in IPL
  • మొహాలీలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • ఇంకా కోలుకోని ధావన్... పంజాబ్ సారథిగా శామ్ కరన్
  • ఆర్బీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ కు దూరం
  • ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ చేయనున్న వైనం
  • ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా నిలుస్తోంది. సొంతగడ్డపై ఆడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

బెంగళూరు జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగనున్నాడని తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ వెల్లడించాడు. డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ కు దూరంగా ఉంటాడని వివరించాడు. గతంలో అనేక సీజన్ల పాటు ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి కెప్టెన్ గా కనిపించనున్నాడు. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా, ఆర్బీబీ జట్టు 5 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.

కాగా, ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు సారథి శిఖర్ ధావన్ ఆడడంలేదు. అతడు ఇంకా కోలుకోవాల్సి ఉందని తాత్కాలిక కెప్టెన్ శామ్ కరన్ వెల్లడించాడు. తుదిజట్టులోకి లియామ్ లివింగ్ స్టోన్, నాథన్ ఎల్లిస్ లను తీసుకున్నామని తెలిపాడు. 


Advertisement
Virat Kohli
Captain
RCB
Punjab Kings
IPL-16

More Telugu News