Prathipadu: వరుపుల సత్యప్రభకు ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్‌ గా బాధ్యతలు

  • ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియామకం
  • ఇటీవలి వరకు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సత్యప్రభ భర్త
  • ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వరుపుల రాజా
  • పార్టీ నేతల అభిప్రాయం మేరకే సత్యప్రభకు పదవి
Varupula Satyaprabha appointed as Prathipadu TDP Incharge

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వరుపుల సత్యప్రభ నియమితులయ్యారు. ఇటీవలి వరకు ఆ పదవిలో కొనసాగిన ఆమె భర్త అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో పార్టీ నేతల నుంచి అభిప్రాయం సేకరించిన అనంతరం సత్యప్రభను ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిన్న అధికారికంగా ప్రకటించారు.

టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు డీసీసీబీ చైర్మన్‌గా రాజా పనిచేశారు. గుండెపోటుతో ఈ నెల 4న ఆయన మృతి చెందారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా ఆయన పాడె మోశారు. కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

More Telugu News