Balakrishna: 50 రోజులను పూర్తిచేసుకున్న 'వీరసింహా రెడ్డి'

  • బాలయ్య మాస్ డైలాగ్స్ కు, మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
  • బలమైన కంటెంట్ తో మెప్పించిన దర్శకుడు
  • వరలక్ష్మి శరత్ కుమార్ నటన హైలైట్ 
  • హనీ రోజ్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ  
Veera Simha Reddy Movie Completed 50 days

బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన 'వీరసింహా రెడ్డి', సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 4 రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా అనిపించుకుంది. 

అలాంటి ఈ సినిమా ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఇంకా కొన్ని సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'వీరసింహారెడ్డి' తరువాత చాలా సినిమాలు థియేటర్లకు వచ్చాయి. అయినా ఆ పోటీని తట్టుకుంటూ ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. 

ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గోపీచంద్ మలినేని టేకింగ్ .. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ .. మాస్ స్టెప్పులు .. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ .. హనీ రోజ్ గ్లామర్ ఈ సినిమా హైలైట్స్ గా నిలిచాయి. ఈ సినిమా విజయం ప్రధానమైన పాత్రను పోషించాయి.

More Telugu News