Andhra Pradesh: పదవి దక్కిన 2 రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే భర్త

  • ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆలూరు
  • రెండు రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లిన వైసీపీ నేత
  • రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రతినిధి బృందంతో కలిసి జర్మనీ వెళ్లిన వైనం
ap government advisor aluru sambasiva reddy is in germany tour

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత ఆలూరు సాంబశివారెడ్డి ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. విద్యా శాఖలో సలహాదారుగా జగన్ సర్కారు ఆయనను నియమించగా... ఆ మరునాడే పదవీ బాధ్యతలు చేపట్టిన సాంబశివారెడ్డి...ఆ మరునాడే విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఏపీ ఉన్నత విద్యా శాఖ ప్రతినిధి బృందం బుధవారం జర్మనీ పర్యటనకు వెళ్లింది. ఈ బృందంలో సాంబశివారెడ్డి కూడా ఉన్నారు. 


జర్మనీ విద్యా శాఖతో చర్చల నిమిత్తం ఏపీ ఉన్నత విద్యా శాఖ ప్రతినిధి బృందం ఆ దేశ పర్యటనకు వెళ్లింది. విద్యకు సంబంధించి పలు కీలక అంశాలపై ఇరు వర్గాలు చర్చలు జరపనున్నాయి. ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సాంబశివారెడ్డి కీలక భూమిక పోషించనున్నారు. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జొన్నలగడ్డ పద్మావతి భర్తే ఆలూరు సాంబశివారెడ్డి అన్న సంగతి తెలిసిందే.

More Telugu News