Chiranjeevi: సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: 'గాడ్ ఫాదర్' డైరెక్టర్

  • 'గాడ్ ఫాదర్' గా వచ్చిన చిరంజీవి
  • ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన సల్మాన్ 
  • చిరూ పక్కన కనిపిస్తే చాలన్న సల్మాన్
  • కథ వినకుండా చేయడం గొప్ప విషయమన్న మోహన్ రాజా 
Mohan Raja Interview

చిరంజీవి - మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన 'గాడ్ ఫాదర్' సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోహన్ రాజా మాట్లాడాడు. 

'ధ్రువ' సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి నేను చరణ్ ను కలుస్తూ ఉండేవాడిని. ముందుగా తనతో 'లూసిఫర్' రీమేక్ చేయమని చిరంజీవిగారు అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కావాలని చిరంజీవి గారిని అడిగినప్పుడు, ఆయన సల్మాన్ గురించి ప్రస్తావించారు. 

'లూసిఫర్' మూవీని ఒకసారి చూడమని సల్మాన్ ఖాన్ కి చెప్పినా ఆయన చూడలేదు. చిరంజీవిగారి పక్కన కనిపిస్తే చాలు అని అనడం ఆయన గొప్పతనం. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నాకు చిరంజీవిగారు చెప్పారు. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్ కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News