Congress: రేపే రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభం... హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన రేవంత్ రెడ్డి

  • క‌న్యాకుమారి నుంచి యాత్ర‌ను ప్రారంభించ‌నున్న రాహుల్ గాంధీ
  • పోస్ట‌ర్‌ను రూపొందించిన‌ యూత్ కాంగ్రెస్‌, ఎన్ఎస్‌యూఐలు
  • గాంధీ భ‌వ‌న్‌లో పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన రేవంత్ రెడ్డి
tpcc chief revanth reddy unviels bharat jodo yatra poster in hyderabad

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్ట‌నున్న భార‌త్ జోడో యాత్ర రేపు (బుధ‌వారం) ప్రారంభం కానుంది. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా దాదాపుగా 3,500 కిలోమీట‌ర్ల మేర సాగ‌నున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు శంఖారావాన్ని పూరించ‌నుంది. ఇప్ప‌టికే యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్తి కాగా... ఆయా రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు యాత్ర‌కు స‌న్నాహాలు చేస్తున్నాయి.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) మంగ‌ళ‌వారం రాహుల్ యాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భ‌వ‌న్‌లో ఈ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. యువజన కాంగ్రెస్‌, పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐలు ఈ పోస్ట‌ర్ల‌ను రూపొందించాయి.

More Telugu News