Telangana: తెలంగాణలో తాజాగా 177 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 14,271 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 69 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 290 మంది
  • ఇంకా 1,293 మందికి చికిత్స
Telangana corona report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 14,271 శాంపిల్స్ పరీక్షించగా, 177 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 69 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 9, నల్గొండ జిల్లాలో 8 కేసులు గుర్తించారు. ఇంకా 445 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 290 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు 8,34,814 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,29,410 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,293 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

More Telugu News