Vizag: బెంగ‌ళూరుకు మ‌కాం మార్చిన సాయి ప్రియ‌... ప్రియుడితో పెళ్లి ఫొటోలను త‌ల్లిదండ్రుల‌కు పంపిన వైనం

  • సోమ‌వారం సాయంత్రం అదృశ్య‌మైన సాయి ప్రియ‌
  • బుధ‌వారం ఉద‌యం నెల్లూరులో ఉన్న‌ట్లు గుర్తింపు
  • సాయంత్రానికే బెంగ‌ళూరులో ప్ర‌త్య‌క్ష‌మైన వైనం
  • ప్రియుడితో పెళ్లి చేసుకున్న ఫొటోలను పంపిన వైనం

వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి విశాఖ బీచ్‌కు వెళ్లి భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి ప్రియుడితో ప‌రారైన సాయి ప్రియ వ్య‌వ‌హారంలో బుధ‌వారం మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. సోమ‌వారం సాయంత్రం అదృశ్య‌మైన సాయి ప్రియ రెండు రోజుల త‌ర్వాత బుధ‌వారం నెల్లూరులో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆమెను విశాఖ‌కు త‌ర‌లించేందుకు పోలీసులు య‌త్నిస్తున్న త‌రుణంలో సాయిప్రియ అక్క‌డి నుంచి చిన్న‌గా జారుకుంది.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో సాయి ప్రియ ఉన్న‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరు నుంచే ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌కు వాట్సాప్ మెసేజ్ పంపింది. తాను క్షేమంగానే ఉన్నాన‌ని, త‌న కోసం వెత‌క‌వ‌ద్దంటూ స‌ద‌రు మెసేజ్‌లో ఆమె కోరింది. అంతేకాకుండా నెల్లూరుకు చెందిన తన ప్రియుడు రవితో పెళ్లి చేసుకున్న ఫొటోలను కూడా ఆమె తల్లిదండ్రులకు పంపంది. మెడలో కొత్త తాళిబొట్టు స్పష్టంగా కనిపించేలా ఫొటోలను ఆమె సదరు మెసేజ్ ద్వారా పంపింది. ఈ మెసేజ్‌ను సాయి ప్రియ త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు తెలియ‌జేశారు.

More Telugu News