Telangana: తెలంగాణలో కొత్తగా 652 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 33,017 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 297 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 627 మంది
  • ఇంకా 4,711 మందికి చికిత్స
Telangana corona statistics report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,017 కరోనా పరీక్షలు నిర్వహించగా, 652 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 297, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 627 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 8,13,772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,04,950 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 4,711 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

More Telugu News